Russia Ukraine War: రష్యా మిస్సైల్ దాడులతో శిధిలమౌతున్న ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్

Fri, 25 Feb 2022-11:12 pm,

భారీ ఎత్తున సాగిన మిస్సైల్ దాడులతో ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్ విధ్వంసంగా మారింది. ఎక్కడ చూసినా దెబ్బతిన్న భారీ భవంతులే కన్పిస్తున్నాయి.

రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ వ్యూహాత్మకంగా నలువైపుల్నించీ దాడులు చేస్తున్నారు. భౌతిక దాడులతో పాటు సైబర్ దాడులు, మిస్సైల్ దాడులు, ఆర్టిల్లరీ స్ట్రైక్స్ ఇలా విభిన్నమైన దాడులు చేస్తున్నారు. 

ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంను రష్యా దాదాపుగా ఆక్రమించేసింది. 96 గంటల్లో మొత్తం సీజ్ చేయనుంది.

కీవ్ రాజధాని నగరంలో ఉక్రెయిన్ సైనిక దళాలు..రష్యా ఎయిర్‌క్రాఫ్ట్‌ను కూల్చేశాయి. ఆ విమానం కాస్తా నివాసప్రాంతంపై పడటంతో మొత్తం అగ్నికి ఆహుతైంది

రష్యా విమానం కూలిన ఘటనలో దెబ్బతిన్న అపార్ట్‌మెంట్ భవనాలు. రెండవ ప్రపంచయుద్ధం సమయంలో నాజీల దాడుల్ని గుర్తు చేస్తోందని వ్లాదిమిర్ పుతిన్ వ్యాఖ్యానించారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link