Shruti Haasan: వారంతా వాడుకొని మోసం చేశారు - శృతిహాసన్ హాట్ కామెంట్స్..!

Sat, 19 Oct 2024-11:28 am,

 కోలీవుడ్ స్టార్ హీరో కమలహాసన్.. కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన.. శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొత్తలో ఐరన్ లెగ్ అంటూ ముద్ర వేయించుకున్న ఈమె,  ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో తనలోని.. టాలెంట్ ను  నిరూపించుకొని స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. 

ఆ తర్వాత ఎంతోమంది స్టార్ హీరోలతో జతకట్టిన.. ఈ అమ్మడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకొని, ఇటీవల ప్రభాస్ నటించిన సలార్ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. ఒకరకంగా చెప్పాలంటే శృతిహాసన్ సినిమాల కంటే వ్యక్తిగత కారణాలవల్లే ఎక్కువగా వార్తల్లో.. నిలిచింది.  చాలామందితో ఎఫైర్ నడిపిన ఈమె వారితో డేటింగ్ చేసి, సహజీవనం చేసి చివరికి వారి నుండి దూరమై కొత్త వ్యక్తిని వెతికే పనిలో పడింది. 

చివరగా డూడిల్ ఆర్టిస్ట్ శాంతన్ తో.. ప్రేమలో పడి సహజీవనం చేసిన ఈమె ఇటీవల.. అతడి నుంచి విడిపోయి కొత్త బాయ్ ఫ్రెండ్ వేటలో పడింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈమె చేసిన కామెంట్లు చాలా వైరల్ గా మారుతున్నాయి . అందరూ తనను..వాడుకొని మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది శృతిహాసన్.   

శృతిహాసన్ మాట్లాడుతూ.. ‘నాతో చాలామంది లంచ్, డిన్నర్ , బ్రేక్ ఫాస్ట్ లకి వచ్చేవారు. హోటల్ కి కలిసి వెళ్తే నాతోనే బిల్లు కట్టించేవారు. అలా ఎంతో డబ్బు నష్టపోయాను. ముఖ్యంగా అబ్బాయిలు ఎక్కువగా నాతో బిల్లు కట్టించారు. ఇదేంటని ఒకసారి అడిగితే.. నీకు బిల్లు కట్టడం ఇష్టమేమో అనుకున్నాను అంటూ ఒక వ్యక్తి చెప్పాడని,  అలా తాను చాలా మందిని నమ్మి డబ్బు విషయంలో మోసపోయాను’ అని కూడా శృతిహాసన్ చెప్పుకొచ్చింది.  

 ఇకపోతే ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. మరొకవైపు అడివి శేష్ హీరోగా నటిస్తున్న డెకాయిట్ లో సగభాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత చిత్ర నిర్మాతలతో ఇబ్బంది వచ్చి సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link