Sobitha Dhulipala: శోభితా ధూళిపాల ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా.. మొత్తం ఆస్తుల విలువ ఎంతంటే.. ?

Thu, 08 Aug 2024-10:14 am,

శోభితా ధూళిపాల  తెలుగు సహా వివిధ భాషల్లో వరుస సినిమాలతో అలరించడంతో పాటు.. ఎప్పటికపుడు తన హాట్ ఫోటో షూట్‌లతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఈమె అక్కినేని ఇంటి కోడలు కాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ రోజు ఎంగేజ్మెంట్ ఉంగరాలు మార్చుకోబోతున్నారనే వార్తలు వస్తున్నాయి.

అయితే.. అక్కినేని, శోభితా కుటుంబాలకు చెందిన కొద్ది మంది మిత్రుల సమక్షంలోనే మీడియాకు దూరంగా..  వీళ్లిద్దరు ఉంగరాలు మార్చుకోబోతున్నారు. శ్రావణ మాసంలో ఈరోజు మంచి ముహూర్తం ఉండటంతో ఈ రోజే ఈ తంతు జరపనున్నట్టు సమాచారం.

శోభితా ధూళిపాల.. అచ్చ తెలుగందం.. ముందుగా ఈమె తన మాతృభాష తెలుగులో  కాకుండా హిందీలో తెరకెక్కిన 'రమన్ రాఘవ్ 2.O' మూవీతో హీరోయిన్‌గా సినీ నటిగా  ఎంట్రీ ఇచ్చింది. 

శోభితా కెరీర్..బాలీవుడ్ సినిమాతో ప్రారంభమైన ఆ తర్వాత తెలుగు, తమిళం,మలయాళంలో హీరోయిన్ గా  తన లక్ పరీక్షించుకుంటుంది శోభితా.

31 మే 1992 ఆంధ్ర ప్రదేశ్ తెనాలిలో  వేణు గోపాల్ రావు, శాంతి కామాక్షి దంపతులకు  జన్మించిన శోభితా దూళిపాల.. ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ గెలుచుకుంది. ఆమె తండ్రి వృత్తి రీత్యా నావల్ ఆఫీసర్ కావడంతో వీళ్ల కుటుంబం విశాఖకు షిఫ్ట్ అయింది. అక్కడ లిటిల్ ఏంజెల్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్ లో చదువుకుంది.

 

ఆ తర్వాత వీరి కుటుంబం ముంబైకు మకాం మార్చింది. అక్కడే బీ.కాం తో పాటు ఎం.కామ్ పూర్తి  చేసింది. ఆ తర్వాత  మోడలింగ్ నుంచి అందాల కిరీటీం గెలుచుకొని సినీ రంగంలోకి ప్రవేశించింది. ఈమె కుటుంబం హై ప్రొఫైల్ ఫ్యామిలీ. ఈమె మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ. 35 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

తెలుగులో అడివి శేష్ హీరోగా నటించిన 'గూఢచారి'మూవీతో తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చింది శోభితా ధూళిపాల.కేవలం సినిమాలే కాదు.. 'మేడ్ ఇన్ హెవన్', 'బర్డ్ ఆఫ్ బ్లడ్', 'ది నైట్ మేనేజర్‌' వంటి  వెబ్ సిరీస్‌లో తన యాక్టింగ్‌తో మెప్పించింది. ప్రస్తుతం శోభితా... సినిమాలతో పాటు.. యాడ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తూ ఫుల్ బిజీగా ఉంది. త్వరలో అక్కినేని ఇంటి కోడలు కాబోతుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link