Tirupati Railway Station: తిరుమల వెళ్లేవారికి అప్డేట్.. పూర్తిగా మారబోతున్న తిరుపతి రైల్వే స్టేషన్.. ఎక్కడ, ఎలా ఉంటుందంటే..

Sun, 20 Oct 2024-4:45 pm,

తిరుపతి రైల్వే స్టేషన్ కు సంబంధించిన రూపురేఖలు అతి త్వరలోనే మార్చబోతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వే స్టేషన్ కి రూ.300 కోట్లతో త్వరలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జతచేయబోతోంది. రైల్వే స్టేషన్ లో భాగంగా త్వరలోనే ఫ్లాట్ ఫార్ముల పైభాగాలను కూడా వినియోగించుకునేందుకు కొత్తగా అద్భుతమైన నిర్మాణాలు చేపట్టబోతోంది.  

అంతేకాకుండా ఈ రైల్వే స్టేషన్ కు అద్భుతమైన డిజైన్తో కూడిన టెర్మినల్ భవనాలను నిర్మించబోతోంది. అలాగే ప్లాట్ఫామ్స్ పై ప్రత్యేకమైన స్పేస్ ను క్రియేట్ చేసి కమర్షియల్ గా అందించబోతున్నట్లు తెలుస్తోంది.  

రూ.300కోట్లతో రైల్వే స్టేషన్ కు సంబంధించిన అభివృద్ధి పనులు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. అంతేకాకుండా బ్రహ్మోత్సవాలలో తిరుపతికి వచ్చే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఫ్లాట్ ఫార్మ్స్ ను కూడా ఆధునికరించబోతున్నట్లు తెలుస్తోంది.    

అంతేకాకుండా తిరుపతికి వెళ్లే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైన ఫుట్‌ ఓవర్ బ్రిడ్జిలను కూడా క్రియేట్ చేయబోతున్నట్లు సమాచారం. అలాగే వెయిటింగ్ లాంజ్‌లు, కమర్షియల్ ఏరియాను అభివృద్ధి చెయ్యబోతోంది. అత్యంత రద్దీగా ఉండే ఈ తిరుపతి రైల్వే స్టేషన్ ప్రయాణికులకు ఆహ్లాదకరంగా మారబోతోంది.  

అయితే తిరుపతిలోని రైల్వే స్టేషన్ కు సంబంధించిన టెర్మినల్ కొత్త భవనానికి సంబంధించిన నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. అతి త్వరలోనే దీనిని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు అక్కడి రైల్వే అధికారులు తెలిపారు.  

అంతేకాకుండా కేంద్ర రైల్వే శాఖ త్వరలో అభివృద్ధి చేయబోయే ఈ తిరుపతి రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫాములపై భాగాలను కూడా కమర్షియల్ గా సద్వినియోగం చేసుకునేందుకు కొత్త డిజైన్లతో నిర్మాణాలు చేపట్టబోతున్నట్లు తెలిపింది. ప్లాట్ఫార్మ్స్ వద్ద రైలు రాకపోకలు దృష్టిలో పెట్టుకొని అద్భుతమైన స్పేస్ను క్రియేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link