Tollywood Director Maruthi: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. థియేటర్‌లో మూవీ చూసిన ఆనందంలో డైరెక్టర్

Fri, 04 Dec 2020-11:36 am,

కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ నిబంధనల నేపథ్యంలో మార్చి నెల నుంచి థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు మూత పడ్డాయి. తాజాగా సినిమా షూటింగ్స్ ప్రారంభం కావడంతో కొంత ఆసక్తి, ఆశ కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ డైరెక్టర్ మారుతి ప్రసాద్ మల్టీప్లెక్స్‌కు వెళ్లి మూవీ వీక్షించారు. అందుకు సంబంధించిన ఫొటోలు షేర్ చేసుకున్నారు.

వినోదం కావాలి, కానీ ఏ ప్రమాదం లేకుండా హాయిగా వినోదాన్ని పొందాలని అన్ని జాగ్రత్తలు పాటించాలని టాలీవుడ్ డైరెక్టర్ మారుతి అన్నారు. ఈ మేరకు స్క్రీన్ 6లో మూవీ చూసేందుకు వెళ్లారు. ఆయనతో పాటు కొందరు సన్నిహితులు కూడా ఉన్నారు.

సినిమా టికెట్టు చూసి ఎన్ని రోజులైందో అంటూ నిన్న డైరెక్టర్ మారుతి ఓ మూవీ టికెట్ పోస్ట్ చేశారు. నేడు మూవీ చూసేందుకు ప్రసాద్ ఐమాక్స్‌కు వెళ్లారు. టిక్కెట్ చూడగానే తెలుగు ప్రేక్షకులకు ప్రాణం లేచొచ్చినట్లవుతుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link