పందిపిల్లతో పాదయాత్ర చేసిన టాలీవుడ్ దర్శకుడు రవిబాబు

Fri, 02 Nov 2018-7:01 pm,

రోటీన్‌కి భిన్నంగా సినిమాలు తీయడంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న దర్శకుడు రవిబాబు.. ఈ చిత్రానికి కూడా డైరెక్షన్ చేయడం విశేషమని అంటున్నారు పలువురు సినీ అభిమానులు.

నవంబర్ 7 తేదిన ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా నవంబర్ 2వ తేదిన సాయంత్రం 3:30 గంటలకు హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ నుండి ఫిల్మ్ ఛాంబర్ వరకు పందిపిల్లతో పాదయాత్ర  చేశారు రవిబాబు.

అభిషేక్‌ వర్మ, నభా నటేశ్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో పందిపిల్ల పేరు "బంటి".  

ఈ సినిమాలో పందిపిల్ల నిజంగా ఉండేలా కనిపించడానికి లైవ్‌ యాక్షన్‌ 3డి యానిమేషన్‌ టెక్నాలజీని ఉపయోగించారట.  

ఈ చిత్రంలో పందిపిల్లకు నటకిరీటి రాజేంద్రప్రసాద్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం

సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఈ చిత్రాన్ని పంపిణీ చేయడం విశేషం. ఈ చిత్రాన్ని ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link