Pushpa 2: ఇదేంపైత్యం రా నాయన.. ‘పుష్ప-శ్రీవల్లీ’ వినాయకుడంటా.. చూశారా..?

Wed, 04 Sep 2024-3:38 pm,

ప్రతి ఏడాది కూడా వినాయక చవితి ఉత్సవాలను ప్రజంతా ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ఈసారి సెప్టెంబర్ 7 న వినాయక చతుర్థి ఉత్సవాలను నిర్వహించనున్నారు. కొంత మంది 3 రోజులు, మరికొందరు 5 రోజులు, 11 రోజులు కూడా నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఇప్పటి నుంచి ఎక్కడ చూసిన కూడా వినాయకుడి విగ్రహాలు సందడి చేస్తున్నాయి.  

ఇటీవల కాలంలో కొంత మంది అతిగా ప్రవర్తిస్తున్నారు. ప్రతి ఏడాది వినాయకుడ్ని తయారు చేసేటప్పుడు.. ఆ సమయంలో ట్రెండింగ్ లో ఉన్న సినిమాలలోని హీరోలు, సినిమా థీమ్ తో వినాయకుడిని తయారు చేస్తున్నారు. ఈసారి పుష్ప2 థీమ్ తో గణపయ్యలను తయారు చేశారు.

ముంబైలోని పలు ప్రాంతాలలో పుష్ప2 థీమ్ తో..గణపయ్యలను తయారు చేశారు . ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. మండిపడుతున్నారు. ఇదేం పిచ్చి అంటూ ఫైర్ అవుతున్నారు.

పుష్ప2 మూవీలో.. అల్లుఅర్జున్ తగ్గెదెలా.. అన్న థీమ్ లో కూడా.. గణపయ్యను కూడా తయారు చేశారు. అంతేకాకుండా.. ఈసారి వెరైటీగా ‘పుష్ప-శ్రీవల్లీ’.. థీమ్లో గణేషుడిని తయారు చేశారు. ప్రస్తుతం ఇదివైరల్ గా మారింది.   

మరోవైపు దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది మట్టి వినాయకుల్ని పూజించాలని చెప్తున్నారు. అంతేకాకుండా.. పీఓపీతో తయారు చేసిన గణపయ్యలను ఉపయోగించకుండా.. మట్టి వినాయకుల్ని కొనాలని చెప్తుంటారు.

పండితులు కూడా ఇలాంటి విధంగా గణపయ్యలను తయారు చేసి.. దేవుడ్ని అవమానపర్చే విధంగా చేయోద్దని కూడా చెబుతున్నారు. ఇలాంటి విగ్రహాలను చూస్తే.. దేవుడిలాగా ఎలా అనిపిస్తుందని కూడా.. కొంత మంది మండిపడుతున్నారు. ప్రస్తుతం ఇది వివాదాదస్పదంగా మారింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link