Virat Kohli IPL Records: ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు.. ఏ జట్లపై శతకాలు చేశాడంటే..?

Mon, 22 May 2023-6:06 pm,

2016 సీజన్‌లో విరాట్ కోహ్లీ తొలి సెంచరీ అందుకున్నాడు. రాజ్‌కోట్‌లో గుజరాత్ లయన్స్‌పై శతకం (100) బాదాడు.   

అదే సీజన్‌లో పూణె సూపర్‌జెయింట్స్‌పై బెంగుళూరు వేదికగా రెండో సెంచరీ (108) నమోదు చేశాడు.   

ఈ సీజన్‌లోనే గుజరాత్ లయన్స్‌పై మరో శతకం బాదాడు కింగ్ కోహ్లీ. 55 బంతుల్లో 109 పరుగులు చేశాడు.  

2016 సీజన్‌లో నాలుగో సెంచరీని కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై పూర్తి చేసుకున్నాడు. 50 బంతుల్లో 113 పరుగులు చేశాడు.   

2019 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఈడెన్ గార్డెన్స్‌లో 58 బంతుల్లో 100 పరుగులు చేసి ఐపీఎల్‌లో ఐదో శతకం పూర్తి చేసుకున్నాడు.   

ఈ సీజన్‌లో రెండు సెంచరీలతో చెలరేగాడు విరాట్ కోహ్లీ. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ తన ఆరో సెంచరీ (100)ని నమోదు చేశాడు  

గుజరాత్ టైటాన్స్‌పై  101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లీ అద్భుతంగా ఆడుతున్నా.. దురదృష్టవశాత్తూ ఆర్‌సీబీ ఒక్కసారి కూడా టైటిల్ అందుకోలేదు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link