తప్పులు చేయడం మానవ సహజమని రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. తన తప్పులను ఎత్తి చూపించే బీజేపీ వారిని స్నేహితులుగా సంబోధించిన రాహుల్, ప్రధాని మోదీలా తాను కూడా మనిషినేనని..తప్పులు అందరూ చేస్తారని.. ఆ తప్పులే జీవితాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తాయని తెలిపారు. "నా తప్పులను మీరు ఎంచుతూనే ఉండండి.. నా తప్పులను ఎత్తి చూపించే మీకు నా ధన్యవాదాలు.. నా ఉన్నతికి అవి ఎంతో తోడ్పడతాయి.. మీ పట్ల నాకు ఎనలేని ప్రేమ ఉంది" అని రాహుల్ ట్వీట్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంగళవారం నాడు రాబోయే గుజరాత్ ఎన్నికలను ఉద్దేశించి రాహుల్ ట్వీట్ చేస్తూ.. మోదీని ప్రతీ రోజూ ఒక ప్రశ్న అడగాలని భావిస్తున్నానని.. వాటికి సమాధానం చెప్పాలని కోరారు. అందులో భాగంగా మొదటి ప్రశ్నను పోస్టు చేస్తూ.. బీజేపీ కేవలం ధనికుల కోసమే పనిచేస్తుందా? చూడండి ధరలు ఎలా పెరిగాయో అని చెబుతూ గత సంవత్సరాన్ని.. నేటి సంవత్సరంతో పోల్చే ధరల పట్టికను పోస్టు చేశారు. అయితే ఆ పట్టికలో పలు తప్పులు ఉండడంతో బీజేపీ అభిమానులు మండిపడ్డారు. తర్వాత అదే ట్వీట్‌ను రాహుల్ సరిచేయడం గమనార్హం.