Bhishma Ashtami 2024: ప్రతి సంవత్సరం మాఘ మాసంలోని శుక్ల పక్ష అష్టమి తిథి నాడు భీష్మ అష్టమి జరుపుకుంటారు. ఈ ఏడాది భీష్మ అష్టమి రేపు అంటే 2024 ఫిబ్రవరి 16న జరుపుకోనున్నారు. మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున భీష్మ పితామహుడు ఉత్తరాయణంలో తన జీవితాన్ని విడిచిపెట్టాడు. భీష్మ అష్టమి రోజున ఉపవాసం ఉండడం చాలా ఫలప్రదం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 శుభ సమయం..
మాఘమాసంలోని శుక్ల పక్ష అష్టమి తిథి ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం 8:54 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 8.15 గంటలకు ముగుస్తుంది. అంటే 16న భీష్మ అష్టమి జరుపుకోనున్నారు. 


భీష్మ అష్టమి ప్రాముఖ్యత..
మహాభారత కాలంలో భీష్మ పితామహుడు బ్రహ్మచారి జీవితాన్ని గడిపాడు. అతను తన మరణ సమయాన్ని నిర్ణయించే వరం కలిగి ఉన్నాడు. భీష్మ పితామహుడు మాఘ మాసంలోని శుక్ల పక్ష అష్టమి తిథిని ఎంచుకున్నాడు. ఈ రోజు నుండి సూర్యభగవానుడు ఉత్తరాయణం వైపు పయనించడం ప్రారంభిస్తాడు. సనాతన ధర్మంలో ఈ సమయం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.


ఇదీ చదవండి: కలలో మీరు మీ మరణాన్ని చూశారా? ఇది ఏ విపత్తుకు దారితీస్తుందో తెలుసా?


పూజా నియమాలు..
ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి. శివుడిని పూజించండి. భక్తితో రోజంతా ఉపవాసం ఉండండి. పండితుల ద్వారా పూర్వీకులకు నైవేద్యాలను సమర్పించండి. అదేరోజు సాయంత్రం ఉపవాసం విరమించండి.


 ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు


1. భీష్మ అష్టమి రోజున ఉపవాసం పాటించడం వల్ల నిజాయితీగల బిడ్డ జన్మిస్తాడు.


ఇదీ చదవండి: రేపు రథ సప్తమి నాడు ఈ ఒక్కపని చేస్తే మీ కెరీర రాకెట్ స్పీడ్‌తో దూసుకెళ్తుందట..!


2. భీష్మ అష్టమి రోజున పూర్వీకులకు నైవేద్యాలు సమర్పిస్తారు. ఉపవాసం పాటించడం వల్ల పిత్ర దోషం నుండి ఉపశమనం లభిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter