Mangal Vakri 2022 Impact: అక్టోబర్ 16న అంగారక గ్రహం వృషభరాశి నుంచి మిధునరాశిలోకి ప్రవేశించింది. ఇవాళ అంటే అక్టోబరు 30 సాయంత్రం 6.54 గంటలకు అదే రాశిలో తిరోగమనం చేయబోతున్నాడు. సాధారణంగా గ్రహాల తిరోగమనం ప్రజలకు ఇబ్బందులను కలిగిస్తుంది. ఛత్ పూజకు ఒక రోజు ముందు అంగారకుడి గమనంలో మార్పు కారణంగా మహాపురుష రాజయోగం (Mahapurusha Raja Yoga) ఏర్పడుతుంది. ఈ యోగం 4 రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం (Taurus): కుజుడు తిరోగమనంలో ఉండటం వల్ల వృషభ రాశి వారికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది. వ్యాపారంలో భారీ లాభం ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తుల నుండి లాభం ఉంటుంది. 


సింహ రాశి  (Leo): కుజుడు వక్ర సంచారం వల్ల సింహ రాశి వారికి చాలా మేలు జరుగుతుంది. ప్రతి పనిలో మీకు అదృష్టం కలిసి వస్తుంది. విద్యార్థులు పరీక్షలో విజయం సాధిస్తారు. కుటుంబంలో మతపరమైన లేదా మాంగ్లిక్ సంఘటనలు జరుగుతాయి.


కన్య (Virgo): కుజుడు తిరోగమనం కారణంగా ఏర్పడుతున్న మహాపురుష రాజయోగం కన్యారాశి వారికి ఉద్యోగ, వ్యాపారాలలో లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారం విస్తరిస్తుంది, లాభాలు పెరుగుతాయి. ఈ సమయంలో ఆస్తికి కనుగోలు  చేయడం మంచిది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. 


కుంభం (Aquarius): కుజుడు తిరోగమనం కారణంగా ఏర్పడిన మహాపురుష రాజయోగం కుంభ రాశి వారికి శక్తిని, ఉత్సాహాన్ని పెంచుతుంది. వీరు ప్రతి పనిని సులభంగా పూర్తి చేస్తారు. ధనం లాభదాయకంగా ఉంటుంది.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)


Also Read:Mangal Vakri 2022: అక్టోబర్‌ 30 నుంచి ఈ రాశులవారికి పంగడే.. ఎప్పుడు ఊహించని లాభాలు పొందుతారు..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook