Mars Transit 2022: మంగళ గ్రహం గోచారం ప్రభావం ఇవాళ్టి నుంచి మూడు రాశులపై పడనుంది. ఎంతలా అంటే ఆ మూడు రాశుల జాతకమే మారిపోయేట్టుగా. ఆ మూడు రాశులవారికి అంతులేని డబ్బు, గౌరవ మర్యాదలు దక్కనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇవాళ అంటే జూన్ 27న మంగళగ్రహం తన రాశి మారనున్నాడు. ఈ రాశి పరివర్తనం ప్రభావం 12 రాశులపై పడనుంది. కొన్ని రాశులపై దుష్ప్రభావం పడితే..ఇంకొన్ని రాశులపై అనుకూలంగా ఉండనుంది. ముఖ్యంగా మూడు రాశులపై మంగళగ్రహం రాశి మారిన తరువాత పాజిటివ్‌గా ఉంటుంది. గ్రహాల్లో మంగళ గ్రహం సేనాపతిగా భావిస్తారు. 


సింహరాశి


మంగళ గ్రహం గోచారం సింహరాశివారికి అత్యంత శుభసూచకంగా ఉంటుంది. ఈ రాశి పరివర్తనంతో సింహరాశి వారి జీవితంలో కీలకమైన మార్పు వస్తుంది. దాంతోపాటు గౌరవ మర్యాదలు, ధనలాభం కలుగుతుంది. 


కన్యారాశి


మంగళ గ్రహం మేషరాశిలో ప్రవేశించనున్నాడు. ఫలితంగా కన్యారాశిపై కీలకమైన ప్రభావం పడుతుంది. కన్యారాశి వారి జీవితంలో ధన సంపద వర్షిస్తుంది. చాలాకాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఆదాయంలో అభివృద్ధి కన్పిస్తుంది. మంగళరాశి పరివర్తనం కన్యారాశివారి ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. 


వృశ్చికరాశి


వృశ్చికరాశివారి జీవితంలో కూడా కీలకమైన మార్పులు సంభవిస్తాయి. ఈ రాశివారికి ధనలాభముంటుంది. ఆదాయపు కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ప్రత్యేకించి వ్యాపారులకు ఇది చాలా అనువైన సమయం.


Also read: Mango Peels Benefits: మామిడి తొక్కలతో కేన్సర్‌కు చెక్, ఇక పొరపాటున కూడా తొక్కలు పాడేయవద్దు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.