ముంబై: టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా ఫిట్‌నెస్‌ను దృష్టిలో ఉంచుకుని న్యూజిలాండ్ పర్యటనకు జట్టును కాస్త ఆలస్యంగా ప్రకటించింది బీసీసీఐ. కానీ కివీస్‌లో పర్యటించే భారత జట్టులో హార్ధిక్ పాండ్యా పేరు లేదు. ఫిట్‌నెస్ సాధించకపోవడంతో పాండ్యాను సెలక్టర్లు ఎంపిక చేయలేదట. వెన్నునొప్పి నుంచి తేరుకున్న హార్ధిక్ ఫిట్ నెస్ సాధిస్తాడని భావించాడు. తన ట్రైనర్ రజనీకాంత్ నిర్వహించిన వర్క్ లోడ్ టెస్ట్‌లోనే హార్ధిక్ ఫెయిలయ్యాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే పాండ్యా ఫెయిలైంది యోయో టెస్టు, బౌలింగ్ ఫిట్ నెస్ టెస్ట్‌లో కాదని.. జాతీయ జట్టులోకి తిరిగి రావాలంటే దేశవాలీలో ఆడి ఫిట్ నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుందని బీసీసీఐ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో హార్ధిక్ పాండ్యా లాంటి మీడియం పాస్ట్ బౌలర్, హార్డ్ హిట్టర్ ఫిట్‌గా ఉండటం ముఖ్యం. దీంతో ఇటీవలి సిరీస్‌లకు దూరంగా ఉన్న పాండ్యాను.. ఫిట్‌నెస్ సాధించని కారణంగా కివీస్ పర్యటనకు ఎంపిక చేయలేదు.


Also Read: న్యూజిలాండ్ పర్యటనకు భారత జట్టు ఎంపిక


విరాట్ కోహ్లీ నేతృత్వంలో కివీస్ టూర్‌కు వెళ్లే జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్‌ను ఎంపిక చేయలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ ధావన్ గాయపడ్డ విషయం తెలిసిందే. కాగా, న్యూజిలాండ్‌తో 5 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్‌లలో భారత్ తలపడనుంది. తొలి టీ20 ఆక్లాండ్ వేదికగా జనవరి 24న జరగనుంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..