Sourav Ganguly on Virat Kohli's ODI Captaincy: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)కి భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ 2021 అనంతరం టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి స్వయంగా తప్పుకున్న కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించింది. వన్డే జట్టు బాధ్యతలను ఇటీవలే టీ20 కెప్టెన్‌గా ఎంపికయిన రోహిత్‌ శర్మ (Rohit Sharma)కు బీసీసీఐ అప్పగించింది. వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని ఉన్నపళంగా తొలగించడంపై సోషల్ మీడియాలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీ (Sourav Ganguly) మరోసారి స్పందించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ (Sourav Ganguly) ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ వన్డే ఫార్మాట్‌ కెప్టెన్సీ నుంచి విరాట్‌ కోహ్లీని ఉన్నపళంగా ఎందుకు తప్పించాల్సి వచ్చిందో తెలిపారు. 'నేను ఇంతకుముందే ఈ విషయం చెప్పాను. టీ20 ఫార్మాట్‌ కెప్టెన్సీని వదులుకోవద్దని నేను వ్యక్తిగతంగా కోహ్లీని అభ్యర్థించాను. కానీ ఆ బాధ్యతలను విరాట్ భారంగా భావించాడు. అలా అనుకోవడం కూడా మంచిదే. కోహ్లీ అద్భుతమైన క్రికెటర్‌. ఎంతో అంకిత భావంతో ఆటను ఆడతాడు. అతను చాలాకాలం పాటు కెప్టెన్‌గా ఉన్నాడు. అందుకే  విరాట్ ఈ నిర్ణయానికి వచ్చాడు' అని దాదా అన్నారు. 


Also Read: Harnaaz Sandhu: ఈ సమయం కోసం 21 సంవత్సరాలు వేచిచూస్తున్నాం.. శతకోటి కలలు నిజమయ్యాయి: లారా దత్త


'నేను కూడా చాలా రోజులు భారత జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించాను. అందుకే నాకు ఆ కారణం తెలుసు. బీసీసీఐ సెలక్టర్లు వైట్ బాల్ ఫార్మాట్‌కు ఒకే కెప్టెన్‌ ఉండాలనుకున్నారు. అందుకే వన్డే ఫార్మాట్ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీని తప్పించారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు. కానీ ఒక్క విషయం చెప్పగలను. ఇదొక అద్భుతమైన జట్టు. కొందరు ప్రతిభావంతులు జట్టులో ఉన్నారు. వారు ఏ లోటు రానీయరని ఆశిస్తున్నాను. భారత్ మంచి విజయాలు అందుకుంటుంది' అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ (Sourav Ganguly) ధీమా వ్యక్తం చేశారు. 


Also Read: Video: రష్మిక ఓ ఊపు ఊపిందిగా... పుష్ప ఈవెంట్‌లో మామూలు పెర్ఫామెన్స్ కాదు..


విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్‌ కెప్టెన్సీ (Virat Kohli Captaincy) బాధ్యతలు వదులుకుంటున్నట్లు ప్రకటించిన సమయంలో పనిభారం చాలా ఎక్కువైందని చెప్పాడు. 'పనిభారాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. దాదాపు 8-9 ఏళ్లుగా మూడు ఫార్మాట్లలో ఆడుతున్నాను. ఐదేళ్లకు పైగా నాయకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తున్నా. చాలా ఒత్తిడి పెరిగిపోయింది. నా కోసం కొంత సమయం వెచ్చించుకొని వన్డే, టెస్ట్‌ ఫార్మాట్లకు నాయకత్వం వహించేందుకు పూర్తిగా సంసిద్ధమై వస్తా' అని కోహ్లీ చెప్పాడు. ప్రస్తుతం టీమిండియా పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు రోహిత్ శర్మ, సాంప్రదాయ ఫార్మాట్‌కు విరాట్ కోహ్లీ సారథులుగా ఉన్నారు.  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook