ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రెట్‌లీ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్‌కు కోచ్‌గా నూతన బాధ్యతలు తీసుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సారి ఐపీఎల్‌లో బలమైన జట్టుగా పాల్గొని, ఇతర జట్లకు మంచి పోటీ ఇవ్వాలని భావిస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటికే ఎంఎస్ ధోని, సురేశ్ రైనా, రవీంద్ర జడేజా లాంటి దిగ్గజ ప్రేయర్లతో ఐపీఎల్ కాంట్రాక్టు కుదుర్చుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ తరుణంలో ఈ జట్టు ఇప్పుడు కోచ్‌ల విషయంలో కూడా కీలక నిర్ణయాన్ని తీసుకోవాలని భావిస్తోంది. జనవరి 27, 28 తేదీల్లో బెంగళూరు వేదికగా ఐపీఎల్‌-11వ సీజన్‌ ఆటగాళ్ల కోసం వేలం జరగనున్న క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ భారీ అంచనాలతో, ప్రణాళికతో రంగంలోకి దిగాలని భావిస్తోంది. స్పాట్ ఫిక్సింగ్‌ ఆరోపణల నేపథ్యంలో ఈ జట్టుపై 2015లో నిషేధం విధించిన సంగతి తెలిసిందే.