మాంచెస్టర్‌ వేదికగా జరుగుతున్న సెమీస్ పోరులో కివీప్ ను భారీ స్కోర్ చేయకుండా భారత బౌలర్లు నిలువరించగలిగారు. ఆది నుంచే క్రమశిక్షణతో బౌలింగ్ వేస్తూ కివీస్ బ్యాట్స్ మెన్లను కట్టడి చేశారు. ఏ మాత్రం నియంత్రణ కోల్పకుండా ప్రతి ఒక్కరూ జగ్రత్తగా బౌలిగ్ చేశారు. ఫీల్డింగ్ విషయంలోనూ పొరపాట్లు దొర్లకుండా కోహ్లీసేన జాగ్రత్త పడింది. ఇలా మ్యాచ్ కొనసాగుతున్న తరుణంగా సరిగ్గా  47 వ ఓవర్లలో వర్షం కురువడంతో మ్యాచ్ కు కాసేపు అంతరాయం కలిగింది. అప్పటికీ కివీస్ 5 వికెట్లు కోల్పోయి 211 (46.1 ఓవర్లు ) పరుగులు చేసింది.