టీమిండియా బౌలర్ గా రాణిస్తున్న కుల్దీప్ యాదవ్ ఇన్ స్టాగ్రామ్ హ్యాక్ అయింది. సైబర్ నేరగాళ్లు కుల్దీప్ ఖాతాను హ్యాక్ చేసి, దానిలో అశ్లీల ఫొటోలు పోస్టు చేశారు. ఇన్ స్టాగ్రామ్ లో కుల్దీప్ కు 3 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ విషయం గురించి తెలియక అభిమానులు క్రికెటర్ ఇలాంటి ఫొటోలు పెట్టాడేంటని అవాక్కయారు. ఫ్రెండ్స్ నుండి ఫోన్ కాల్స్ రావడం.. హ్యాక్ కు గురైందని తెలియడంతో కుల్ దీప్ ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారని, అందులో అసభ్య పోస్టులు ఉంచారని, అభిమానులకు కలిగిన అసౌకర్యానికి బాధపడుతున్నానని తెలిపాడు. తన పాస్వర్డ్ ను బలాన్ని మరింతగా పెంచుకుంటానని, అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలని అన్నారు.