భార్య హసిన్ జహాన్ నుంచి తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఎదుర్కుంటున్న ఇండియన్ పేసర్ మొహమ్మద్ షమి.. బీసీసీఐ తనపై విచారణకు ఆదేశించడంతో ఇక తాను కూడా భార్యపై ఆరోపణలు సంధించడం మొదలుపెట్టాడు. హసీన్ జహాన్ తనను మోసం చేసి పెళ్లి చేసుకుందని.. ఆమెకు గతంలోనే పెళ్లి అయిందన్న విషయాన్ని తన వద్ద దాచిపెట్టిందని షమి ఆరోపించాడు. తాను హసిన్‌ని పెళ్లి చేసుకునేటప్పటికే ఆమెకు మొదటి భర్త ద్వారా ఇద్దరు పిల్లలు వున్నారని.. వాళ్లను చనిపోయిన తన సోదరి పిల్లలు అని అబద్దం చెప్పి నమ్మించింది అని వాపోయాడు షమి. ఆమె మొదటి పెళ్లి సంగతి తెలియని తాను అదంతా నిజం అని గుడ్డిగా నమ్మేసి ఆమెను పెళ్లి చేసుకున్నానని షమి ఆవేదన వ్యక్తం చేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చాలా కాలం తర్వాత హసిన్ జహాన్ చెబితేనే ఆ విషయం తనకు తెలిసింది అని షమీ స్పష్టంచేశాడు. షఫియుద్దీన్ అనే వ్యక్తితో తనకు అంతకుముందే పెళ్లి అయిందని, అతడి ద్వారా కలిగిన సంతానమే ఈ ఇద్దరు పిల్లలు అని చెప్పిన రోజు తాను షాక్‌కు గురయ్యానని తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు షమీ. 


ఇప్పటివరకు తన భర్త మొహమ్మద్ షమినే తనని మోసం చేశాడు అని పోలీసులకు, మీడియాకు చెప్పుకున్న హసీన్ జహాన్.. తాజాగా షమీ చేసిన ఆరోపణలపై ఏమని స్పందిస్తుందో వేచిచూడాల్సిందే మరి!!