టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ రాజకీయాల్లోకి వచ్చారు. ముంబయి సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంజయ్ నిరూపమ్ సమక్షంలో మంగళవారం ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమెకు సంజయ్ కాంగ్రెస్ కండువా కప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృత్తిపరంగా మోడల్ అయిన హసీన్ జహాన్ ఇటీవల వార్తల్లో నిలిచారు. ష‌మీకి ప‌లువురు మ‌హిళ‌ల‌తో అక్ర‌మ సంబంధాలున్నాయ‌ని ఆరోపిస్తూ అందుకు సంబంధించిన ఫొటోల‌ను బ‌హిర్గ‌తం చేసిన విష‌యం విదితమే. షమీ తనను మానసికంగా, శారీరకంగా వేధించాడని ఆరోపించింది. ఈ ఏడాది ఏప్రిల్ 10 హసీన్ జహాన్ కోల్ కతా అలిపోర్ కోర్టులో షమీపై గృహ హింస కేసులు దాఖలుచేశారు. వీటిపై కోల్‌క‌తా పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.


అయితే.. తన విడిపోయిన భార్య హసీన్ జహాన్ చేసిన ఆరోపణలను షమీ ఖండించారు.