శ్రీనగర్: మిస్టర్ కూల్‌గా పేరున్న టీమిండియా మాజీ కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీ ఏం చేసినా అది ఓ సెన్సేషనే అవుతుందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచ కప్ 2019 టోర్నమెంట్ ముగిసిన అనంతరం క్రికెట్‌ నుంచి రెండు నెలల సెలవు తీసుకుని గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో సైన్యంలో చేరిన ధోనీ.. జమ్మూకాశ్మీర్‌లో వివిధ ప్రాంతాల్లో పెట్రోలింగ్ విధులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా లేహ్‌లో ఓ చోట పిల్లల్లో కలిసిపోయి బాస్కెట్ బాల్ కోర్టులో, ఆర్మీ దుస్తుల్లోనే బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు ధోనీ.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ధోనీ బ్యాటింగ్ చేస్తోన్న ఫొటోను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడమే ఆలస్యం ఆ ఫోటో వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నా.. ధోనీకి క్రికెట్‌పై మక్కువ ఏ మాత్రం తగ్గలేదని ధోనీ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.