Cricket World Cup 2023 warm-up match : అక్టోబరు 05ను భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఇప్పటికే జట్లన్నీ భారత్ కు చేరుకున్నాయి. అంతేకాకుండా శుక్రవారం నుంచే వార్మప్ మ్యాచ్లు ఆడటం కూడా మెుదలుపెట్టాయి. ఈ క్రమంలో టీమిండియా శనివారం నాడు ఇంగ్లాండ్ తో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే ప్రపంచ కప్ కోసం 15 మంది టీమ్ సభ్యులను ప్రకటించింది టీమిండియా. అక్షర్ పటేల్ గాయపడటంతో అశ్విన్ను తుది జట్టులోకి తీసుకుంది బీసీసీఐ. మెగా టోర్నీ ముందు వార్మప్ మ్యాచ్ లో గెలిచి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలని టీమిండియా భావిస్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియాతో సిరీస్ నెగ్గి మంచి ఊపు మీదుంది భారత్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గువాహటి వేదికగా వార్మప్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే గువాహటి చేరుకున్న ఇరు జట్లు నెట్స్‌లో ముమ్మరంగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. టీమ్‌ఇండియా వరల్డ్‌ నంబర్‌ 1 హోదాలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ను ఢీకొంటుంది. ప్రపంచ కప్ కోసం జోస్‌ బట్లర్‌ నేతృత్వంలోని ఇంగ్లండ్‌ జట్టు శుక్రవారం ఉదయం భారత్‌కు చేరుకుంది. సుదీర్ఘ ప్రయాణం చేసి అలసిపోయామని ఇంగ్లండ్‌ క్రికెటర్లు తెలిపారు. ఈ మధ్య కాలంలో ఇంగ్లీష్ ప్లేయర్ దూకుడైన ఆటతీరును అలవరుచుకున్నారు. 


వరల్డ్ కప్ కోసం భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, కుల్దీప్ యాదవ్.


Also Read: Pakistan Cricket Team: భారత ఆతిథ్యానికి ఫిదా అయిన పాక్ క్రికెటర్లు.. ఏమన్నారంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook