India won bronze medal in men's hockey at Tokyo Olympics 2020: మణిపూర్: టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు 5-4 తేడాతో జర్మనీపై విజయం సాధించి కాంస్య పతకం (Bronze medal) గెలుచుకుని చరిత్ర సృష్టించింది. దీంతో ఒలింపిక్స్‌లో హాకీ పోటీల్లో పతకం కోసం 41 ఏళ్ల ఎదురుచూపులకు తెరపడి దేశవ్యాప్తంగా సంబరాలకు తెరలేసింది. ఒలింపిక్స్‌లో భారత్ సత్తా చాటిన హాకీ క్రీడాకారులకు దేశం నలుమూలల నుంచి రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు, ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: టోక్యో ఒలింపిక్స్: రెజ్లింగ్‌లో ఫైనల్‌కు చేరిన రవి కుమార్ దహియా


ఒలింపిక్స్‌ హాకీ పోటీల్లో జర్మనీపై 5-4 తేడాతో భారత పురుషుల జట్టు అద్భుత విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభంలో భారత్‌పై జర్మనీ పైచేయి సాధించినప్పటికీ.. సిమ్రంజీత్ సింగ్, హార్దిక్ సింగ్, హర్మన్ ప్రీత్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్ చక్కటి ప్రదర్శన కనబర్చడంతో జర్మనీపై భారత్ (India at Tokyo Olympics) విజయం సాధించింది. భారత పురుషుల హాకీ జట్టు సాధించిన విజయం చూసి దేశం గర్విస్తోంది.


Also read : టోక్యో ఒలింపిక్స్‌: పీవీ సింధుకు ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook