సౌతాఫ్రికా టూర్‌తో సక్సెస్ అందుకుని ఆ తర్వాత శ్రీలంకలో జరిగిన ముక్కోణపు సిరీస్‌కి దూరంగా ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఆల్రెడీ ఐపీఎల్‌తో బిజీ అయిపోయాడు. ఓవైపు ఐపీఎల్ కోసం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూనే, మరోవైపు ఐపీఎల్ కోసం రూపొందిస్తున్న ఓ కమర్షియల్ యాడ్‌లో కోహ్లీ స్టెప్పులేస్తూ కనిపించాడు. 2018 సీజన్‌తోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి కొత్తగా వచ్చిన ప్రముఖ న్యూజిలాండ్ క్రికెటర్ బ్రెండన్ మెక్‌కల్లమ్, లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌లతో కలిసి కోహ్లి స్టెప్పేసిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌‌లో వైరల్‌గా మారింది. ఓ ప్రోడక్ట్ ఎండార్స్‌మెంట్‌కి సంబంధించిన యాడ్ షూటింగ్‌లో భాగంగా తాను లెజెండరీ క్రికెటర్స్ కోహ్లీ, మెక్‌కల్లమ్‌లతో కలిసి స్టెప్పేసిన వీడియోను చాహల్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఏబీ డివిలియర్స్, కోహ్లీ లాంటి పవర్‌ఫుల్ ప్లేయర్స్ జట్టులో వున్నప్పటికీ ఇప్పటివరకు టైటిల్‌ని సొంతం చేసుకోకపోవడం అనేది ఆ జట్టును తీవ్రంగా వేధిస్తోన్న అంశం. అనేకసార్లు ఫైనల్స్ వరకు చేరుకున్న జట్టు అక్కడి నుంచే రన్నరప్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. అయితే, ఈసారి కోహ్లీ, డివిలియర్స్‌తోపాటు కొత్తగా జట్టులోకి వచ్చిన మెక్‌కల్లమ్, క్వింటన్ డికాక్‌లతో కలిసి ఎలాగైనా టైటిల్ సొంతం చేసుకోవాల్సిందేననే కసితో వుంది ఆ జట్టు.