18 year old telangana peddapalli girl stabbed to death by her boyfriend : ప్రేమించిన యువ‌తి పెళ్లికి నిరాక‌రించింద‌నే కోపంతో ఓ ప్రియుడు త‌న ప్రియురాలిని క‌త్తితో గొంతు కోసి చంపేశాడు. ఈ దారుణ హ‌త్య (murder) రామ‌గిరి మండల ప‌రిధిలోని కేకే నగర్‌లో జరిగింది. కేకే న‌గ‌ర్‌కు చెందిన అమ్మాయి(18).. రాజు(22) అనే యువ‌కుడు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆ అమ్మాయి డిగ్రీ చ‌దువుతుండ‌గా, రాజు 8 ఇంక్లైన్ కాల‌నీలో ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌ంటూ రాజు.. తన ప్రియురాలిపై కొద్ది రోజులుగా ఒత్తిడి చేస్తున్నాడు. అయితే ఆమె.. డిగ్రీ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుందామ‌ని రాజుకు చెప్తూ వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : Indian Bank : వీడియో కేవైసీతో బ్యాంకు అకౌంట్ ఓపెన్ చెయొచ్చు


అయితే రాజు మాత్రం వినకుండా వెంటనే పెళ్లి చేసుకోవాల‌ని పట్టుబట్టాడు. దీంతో రాజు (Raju) ఒత్తిడి వల్ల వారిద్ద‌రి మ‌ధ్య తీవ్ర ఘ‌ర్ష‌ణలు చోటు చేసుకున్నాయి. ఈ క్ర‌మంలోనే మంగ‌ళ‌వారం సాయంత్రం ఆమె ఇంటికి వెళ్లిన రాజు.. ఆమె గొంతు క‌త్తితో కోశాడు. అక్క‌డ్నుంచి రాజు ప‌రారీ అయ్యాడు. 


Also Read : Rohit Sharma as T20I Captain: టీమిండియా T20I కేప్టేన్‌గా రోహిత్ శర్మను నియమించిన BCCI


రక్తపు మడుగులో పడి ఉన్న ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. హ‌త్యపై (murder) సమాచారం అందుకున్న పోలీసులు (Police) సంఘటనా స్థలానికి చేరుకుని కేసు (Case) నమోదు చేసుకొని, దర్యాప్తు వేగవంతం చేశారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook