Nalgonda: అతడు ఓ చర్చిలో పియానో ప్లేయర్(Piano player). ఇతడు పియానో ఎంత బాగా వాయిస్తాడో...అమ్మాయిలు, మహిళలను  కూడా అదే విధంగా ట్రాప్ చేస్తాడు. లవ్ చేస్తున్నానని..పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబరచుకుంటాడు. చివరకు మోసం చేసి వదిలేస్తాడు. ఇలా 19 మంది మహిళలను మోసం చేసిన ఘటన నల్గొండ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే.. 
పెళ్లి పేరుతో నల్గొండ(Nalgonda)లో మహిళలను మోసం చేసిన విలియమ్స్‌ అనే వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. స్థానికంగా ఉండే ఓ చర్చిలో పియానో వాయించే ఇతను పలువురు మహిళలను మోసం చేసినట్లు తెలుస్తోంది. చర్చికి వచ్చే యువతులు, మహిళలను విలియమ్స్‌(Williams‌) లోబరుచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 


Also Read: Wife stabs husband: కొడుకు ఆ విషయం చెప్పడంతో... భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య


మొదటి భార్య పోలీసుల(Polce)ను ఆశ్రయించడంతో విలియమ్స్‌ బాగోతం బట్టబయిలైంది. 19 మంది మహిళలను మోసం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు యత్నించారు. కాగా తనకు గుండెపోటు వచ్చిందంటూ విలియమ్స్‌ ఓ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. పలువురు ప్రముఖ రాజకీయ నేతలతో అతనికి పరిచయాలు ఉన్నట్లు తెలుస్తోంది. విలియమ్స్ మీద కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విలియమ్స్ బాగోతం బయటపడడంతో బాధితులు ఒక్కొక్కరు బయటకు వచ్చే అవకాశం ఉంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook