తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (Telangana CM KCR) క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ (Pragathi Bhavan) వద్ద మరోసారి కలకలం రేగింది. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్ ఎదుట ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సీఎం కేసీఆర్ (CM KCR) తనకు డబుల్ బెడ్‌ రూం ఇళ్లు కేటాయించాలని కోరుతూ ప్రగతి భవన్ ఎదుట ఆటో డ్రైవర్ చందర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.  MIDHANI Recruitment 2020: అసిస్టెంట్ జాబ్స్.. ఎగ్జామ్ లేకుండానే రిక్రూట్‌మెంట్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు పెట్టుకునే యత్నం చేశాడు. అయితే ఆటో డ్రైవర్‌ను గమనించిన వెంటనే అక్కడున్న పోలీసులు అతడ్ని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు చందర్ మీద నీళ్లు పోసి ఆత్మాహత్యాయత్నం చేసుకోకుండా కాపాడారు. Telangana Fluoride Problem: ఫ్లోరైడ్‌పై తెలంగాణ విజయం: కేటీఆర్


తెలంగాణ ఉద్యమం తీవ్రంగా కొనసాగుతున్న సమయంలో.. 2010లో అసెంబ్లీ ఎదుట తాను ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఆటో డ్రైవర్ చందర్ తెలిపాడు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సైతం తనకు న్యాయం జరగలేదని వాపోయాడు. అందుకే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కోసం మరోసారి ఈ చర్యకు పాల్పడాల్సి వచ్చిందని తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న చందర్ తెలిపాడు. Telangana: కొత్తగా 2043 కరోనా కేసులు 


ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR