నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత.. ఈ రోజు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నారు. ఇందుకోసం ఆమె నిజామాబాద్ కు ర్యాలీగా వెళ్లారు. ఐతే ఆమె కాన్వాయ్ లో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కారుకు ప్రమాదం జరిగింది. 


'కరోనా వైరస్'పై భయం వద్దు..!!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'కరోనా' సిత్రాలు 


ఈ సమయంలో ఆశన్నగారి జీవన్ రెడ్డి కూడా కారులోనే ఉన్నారు. కానీ ఎమ్మెల్యేకు తృటిలో ప్రమాదం తప్పింది. మాజీ ఎంపీ కవిత నామినేషన్  వేస్తున్న సందర్భంగా ఘటన జరగడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చెందారు. ఐతే  కార్యకర్తలు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. తాను సురక్షితంగానే ఉన్నానని తెలిపారు. మరోవైపు నామినేషన్ వేసేందుకు వెళ్తున్న కవితకు టీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలు ఘనంగా స్వాగతం పలికారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.