ED on Casino: తెలుగు రాష్ట్రాల్లో క్యాసినో వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఇందులో మనీలాండరింగ్ జరగడంతో ఈడీ రంగంలోకి దిగింది. తాజాగా పలువురిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. దాదాపు తొమ్మిదిగంటలపాటు వారిని ప్రశ్నిస్తున్నారు. చికోటి ప్రవీణ్‌తోపాటు తన అనుచరులను ఈడీ సుదీర్ఘంగా విచారిస్తోంది. ప్రవీణ్‌తోపాటు ఆరుగురు ఏజెంట్లు విచారణకు హాజరైనట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చికోటి ప్రవీణ్‌తోపాటు అందర్నీ కలిపి ఈడీ విచారిస్తోంది. విదేశాల్లో నిర్వహించిన గ్యామ్లింగ్ ఈవెంట్స్ లావాదేవీలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మనీ లాండరింగ్‌ కోణంలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈవెంట్ నిర్వహణలో ఒక్కో ఏజెంట్‌కు ఒక్కో పని  అప్పజెప్పినట్లు తెలుస్తోంది. ప్లైట్ బుకింగ్స్, టికెట్స్ బుకింగ్ పనులను సంపత్ చూసుకున్నట్లు ఈడీ తేల్చింది.


హోటల్ బుకింగ్స్, గేమ్ నిర్వహణ, కస్టమర్స్ ఎంటర్‌టైన్మెంట్ పనులను మిగతా ఏజెంట్లు పర్యవేక్షించే వారని అధికారులు గుర్తించారు. ఇటీవల ఈవ్యవహారం వెలుగులోకి వచ్చింది. నేపాల్‌లోని ఓ హోటల్‌లో క్యాసినో నిర్వహించినట్లు ఈడీ అధికారులు తేల్చారు. ఈ మూలాలు హైదరాబాద్‌లో ఉన్నట్లు విచారణలో తేలింది. దీంతో మూడురోజులపాటు హైదరాబాద్‌లో ఈడీ తనిఖీలు చేపట్టింది.


క్యాసినో ఏజెంట్ చికోటి ప్రవీణ్‌తోపాటు అతడి అనుచరుల ఇళ్లల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈడీ విచారణలో చికోటి ప్రవీణ్‌ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. అతడి వద్ద పలురంగాల ప్రముఖులు కస్టమర్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని విదేశాలకు తీసుకెళ్లి క్యాసినో ఆడించినట్లు అధికారులు గుర్తించారు. తాజా విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.


Also read:NTRs Daughter Uma Maheswari: ఎన్టీయార్‌ సంతానంలో చనిపోయిన వాళ్లు వీరే..


Also read:Husband Harassment: హైదరాబాద్‌లో అమ్మాయి కాపురం మూవీ ఘటన.. ఆ వివరాలు..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook