Telangana Corona latest updates: హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ ( Coronavirus ) వినాశనం కొనసాగుతూనే ఉంది. గత 24గంటల్లో కొత్తగా 1,891 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో తెలంగాణ ( Telangana ) లో మొత్తం కేసుల సంఖ్య 66,677కు పెరిగింది. దీంతోపాటు నిన్న 10మంది కరోనాతో మరణించినట్లు వైద్యఆరోగ్యశాఖ ఆదివారం వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 540కి చేరింది. Also read: CoronaVirusపై 110 ఏళ్ల బామ్మ అలవోక విజయం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే.. ఇప్ప‌టివ‌ర‌కు 47,590 మంది బాధితులు కోలుకోగా..  18,547 మంది పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే.. రాష్ట్రంలో క‌రోనా రిక‌వ‌రీ రేటు 71.3 శాతం ఉండగా.. మ‌ర‌ణాల రేటు 0.80 శాతంగా ఉంది. Also read: Sushant Case: రియా చక్రవర్తి జాడ దొరకడం లేదు: బిహార్ డీజీపీ


కొత్త‌గా న‌మోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 517 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 181, మేడ్చ‌ల్ జిల్లా‌లో 146, వ‌రంగ‌ల్ అర్బ‌న్‌లో 138 కేసులు నమోదయ్యాయి.  పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే..