Telangana Coronavirus Updates: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో (డిసెంబరు 26న ) శనివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 472 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ఇద్దరు (2) ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల (positive cases) సంఖ్య 2,84,863 కి చేరగా.. మరణాల సంఖ్య 1,531 కి పెరిగింది. గత 24 గంటల్లో కరోనా నుంచి 509 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఈ మహమ్మారి (Coronavirus) నుంచి ఇప్పటివరకు 2,76,753 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 6,579 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. Also read: Corona Second Wave In Telangana: కరోనా సెకండ్ వేవ్.. జర జాగ్రత్త!: ఈటల రాజేందర్


ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 97.15 శాతం ఉండగా.. మరణాల రేటు 0.53 శాతం ఉంది. తెలంగాణ (Telangana) వ్యాప్తంగా నిన్న 37,347 కరోనా టెస్టులు చేశారు. వీటితో కలిపి డిసెంబరు 26వ తేదీ వరకు మొత్తం 67,23,710 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా.. హైదరాబాద్ (GHMC) పరిధిలో 106 కేసులు నమోదయ్యాయి. Also Read: Telangana: ఖమ్మంలో బీజేపీ నేత దారుణ హత్య



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook