Coronavirus Telangana Updates: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇటీవల కాలంలో కరోనా కేసుల సంఖ్య ప్రతిరోజూ 400లకు తక్కువగా నమోదవుతోంది. గత 24గంటల్లో (జనవరి 9న) శుక్రవారం రాత్రి 8గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 351 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా ఇద్దరు (2) మరణించారు. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ (TS Health Ministry) ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల (positive cases) సంఖ్య 2,89,784 కి చేరగా.. మరణాల సంఖ్య 1,563 కి పెరిగింది. ఇదిలాఉంటే.. నిన్న కరోనా (Coronavirus) నుంచి నిన్న 415 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఈ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,83,463 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 4,756 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. Also Read: India Covid-19: కరోనాతో నిన్న 201 మంది మృతి


ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా (Covid-19) రికవరీ రేటు 97.81 శాతం ఉండగా.. మరణాల రేటు 0.54 శాతం ఉంది. రాష్ట్రంలో (Telangana) నిన్న 37,451 కరోనా టెస్టులు చేశారు. వీటితో కలిపి జనవరి 10వ తేదీ వరకు మొత్తం 72,53,236 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో నిన్న అత్యధికంగా.. హైదరాబాద్ (GHMC) పరిధిలో 65 కేసులు నమోదయ్యాయి. Also read: Farmers Protest: విషం తాగి రైతు బలవన్మరణం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook