హైదరాబాద్ లో పశువైద్యురాలు దిశపై పాశవికంగా అత్యాచారం, హత్య చేసిన ఘటనలో నిందితుడు చెన్నకేశవులు గుర్తున్నాడా..? అతడు పోలీస్ ఎన్ కౌంటర్ లో చనిపోక ముందే అతని భార్య గర్భంతో ఉంది. అప్పటికే ఆమె దాదాపు 8 నెలల నిండు గర్భిణీ. ఇప్పుడు ఆమె పండంటి ఆడ పిల్లకు జన్మనిచ్చింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిన్న ఓ ఆస్పత్రిలో చెన్నకేశవులు భార్య రేణుక .. ఆడ పిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ప్రముఖ సంచలన దర్శకుడు, ప్రస్తుతం దిశ అత్యాచార ఘటనపై 'దిశ' పేరుతో సినిమా తీస్తున్న రామ్ గోపాల్ వర్మ . . తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. గతంలో చెన్నకేశవులు మనస్తత్వాన్ని తెలుసుకోవడం కోసం ఓసారి రేణుకను హైదరాబాద్ లోని తన ఆఫీసుకు పిలిచి మాట్లాడారు వర్మ. అంతే కాదు ఆమెకు సాయం చేస్తానని మాట కూడా ఇచ్చారు. ఆమె (రేణుక) తనకు పుట్టబోయే బిడ్డకు.. అంటే ఆడపిల్ల పుట్టినా.. మగ పిల్లాడు పుట్టినా ..  దిశ అనే పేరు పెడతానని తనకు చెప్పినట్లుగా వర్మ గతంలోనే ట్వీట్ చేశారు.



Read Also: బాబోయ్..బంగారం భగ.. భగ..!!


మరోవైపు ఇప్పుడు ఆమెకు బిడ్డ పుట్టిన సందర్భంగా ఆ విషయాన్ని ట్విట్టర్ లో షేర్ చేసిన వర్మ. .  ఆమెకు సాయం చేయాలనుకునే వారు డబ్బులు పంపించే విధంగా బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇచ్చారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


Read Also: 'కరోనా వైరస్'పై సైకత శిల్పం