Fire Accident At High School Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో అగ్ని ప్రమాదం సంభవించింది. మొఘల్ పుర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పాతబస్తీ గౌలిపుర శ్రీనివాస హైస్కూల్‌లో అగ్ని ప్రమాదం(Fire Accident Latest News) చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటన అగ్నిమాపక సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


గౌలిపుర శ్రీనివాస హైస్కూల్‌లో ఒక్కసారిగా గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న ఆఫీసు నుంచి మంటలు చెలరేగాయి. ఇది గమనించిన హైదరాబాద్(Hyderabad) స్కూల్‌ సిబ్బంది అప్రమత్తయ్యారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మరోవైపు స్థానికుల సాయంతో కొంతమేర మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. కొంత సమయానికే ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పివేశారు.


Also Read: Ujjwala Yojana: Free LPG కనెక్షన్, రూ.1600 రావాలంటే PMUY వివరాలు తెలుసుకోండి


 


అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 50 మంది విద్యార్థులు పాఠశాలలో ఉన్నారని తెలుస్తోంది. స్కూలు ఆఫీసు రూములో ఉన్న ఫైళ్లు, ఫర్నిచర్‌ పూర్తిగా దగ్దమయ్యాయి. మరోవైపు కరోనా వైరస్‌(CoronaVirus) వ్యాప్తి కారణంగా జనవరి వరకు మూసివేసి ఉన్న పాఠశాలలు ఇటీవల తెరుచుకున్నాయి. 9, 10వ తరగతి విద్యార్థులు మాత్రమే తరగతులకు హాజరవుతున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.


Also Read: SBI ఖాతాదారులకు State Bank of India గుడ్ న్యూస్, ఇకపై ఇంటి వద్ద నుంచే ఆ సేవలు 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook