సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం మండలం గుమ్మడిదల సమీపంలోని మహాసాయి కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో నిల్వ చేసి వున్న కెమికల్‌ డ్రమ్ములకు నిప్పంటుకోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. కెమికల్ డ్రమ్ములు పేలుతుండటంతో ఫ్యాక్టరీలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. 


అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న  సంగారెడ్డి అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కెమికల్ ఒకదాని తర్వాత మరొకటి పేలుతుండటంతో అగ్నిమాపక సిబ్బందికి మంటలు ఆర్పడం కష్టంగా మారింది.