హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా మరో 4 మండలాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నేడు నోటిఫికేషన్‌ జారీ చేసింది. సిద్దిపేట జిల్లాలో నారాయణరావుపేట కేంద్రంగా ఒక మండలం, మేడ్చల్‌ జిల్లాలో మూడుచింతలపల్లి కేంద్రంగా మరో మండలం, నిజామాబాద్‌ జిల్లాలోని వర్ని మండలాన్ని పునర్‌ వ్యవస్థీకరించి మొస్రా, చండూరు అనే ఇంకో రెండు మండలాలను ఏర్పాటు చేసినట్టు తెలంగాణ సర్కార్ ఈ నోటిఫికేషన్‌లో పేర్కొంది.