హైదరాబాద్ నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఒక్క ఎల్బీనగర్ జోన్ పరిధిలోనే 24 గంటల వ్యవధిలో ఏడు చైన్ స్నాచింగ్ లో చోటు చేసుకోవడం గమనార్హం. వనస్థపలిపురంలో రెండు చైన్ స్నాచింగ్ కేసులు నమోదు అయ్యాయి. హయత్ నగర్ లో రెండు చోట్ల చైన్ స్నాచింగ్ లు జరిగాయి. ఒంటిరి మహిళలే టార్గెట్ చేసుకొని ఈ దొంగతాలకు పాల్పడుతున్నారు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ మీడియా కథనం ప్రకారం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పద్మావతి అనే మహిళ మెడల్లోంచి నాలుగు తులాల గొలుసును ఎత్తుకెళ్లారు. కుంట్లూర్ లో రోడ్ నిర్మాల అనే మహిళ మెడలోంచి రెండున్న తులాల చైన్ ఎత్తుకెళ్లారు. హయత్ నగరలోని లెక్చరల్ కాలనీలో లక్ష్మమ్మ అనే మహిళ మెడలో నుంచి నాలుగు తులాల చైన్ ను ఎత్తుకెళ్ళారు. ఇలా చెప్పుకుంటూపోతే చైన్ స్నాచర్ల బెడద అంతా ఇంత కాదు...ఏడాది చివర్లో ఇలా చైన్ స్నాచర్లు రెచ్చిపోవడంతో మహిళలు హడలి పోతున్నారు 


ప్రత్యేక టీంతో దుండగుల కోసం గాలింపు


 చైన్ స్నాచింగ్ వ్యవహారం పోలీసులకు సవాల్ గా మారింది. చైన్ స్నాచర్లను పట్టుకునేందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి దుండగలు కోసం గాలిస్తున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డు ఆధారం చేసుకొని దొంగలను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. బయటికి వెళ్లే సమయంలో మహిళలు జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా పోలీసులు సూచిస్తున్నారు