Girls Escaped from Kasturba Gandhi Memorial Trust: హైదరాబాద్ శివారులోని గండిపేట మండలం హైదర్షాకోట్‌లోని కస్తూర్బాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ నుంచి 14 మంది యువతులు పరారయ్యారు. సెక్యూరిటీకి అలికిడి వినిపించకుండా బాత్‌రూమ్ కిటికీ నుంచి వీరు పరారయ్యారు. ట్రస్ట్ మేనేజర్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. శుక్రవారం (ఫిబ్రవరి 18) తెల్లవారుజామున 2గంటల సమయంలో హైదర్షాకోట్‌లోని కస్తూర్భా గాంధీ ట్రస్ట్ నుంచి యువతులు పరారయ్యారు. బాత్‌రూమ్‌ కిటికీ ఊచలు కోసి.. దాని గుండా బయటకు దూకి పారిపోయారు. మొత్తం 15 మంది యువతులు పారిపోయేందుకు యత్నించగా.. వీరిలో ఒక యువతికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఆ యువతి బాత్‌రూమ్‌లోనే ఉండిపోవడంతో సిబ్బంది ఉదయం గుర్తించారు.


మిగతా యువతులు పారిపోయినట్లు తెలుసుకుని ట్రస్ట్ మేనేజర్ రామకృష్ణమూర్తి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పారిపోయిన యువతుల్లో ఎక్కువ మంది బెంగాల్, మహారాష్ట్రలకు చెందినవారుగా తెలుస్తోంది. వీరిని పట్టుకునేందుకు పోలీసులు రెండు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.


ప్రస్తుతం ఈ ట్రస్టులో మొత్తం 18 మంది యువతులు ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో అరెస్టయిన యువతులు, మహిళలను ఇక్కడికి చేరుస్తారు. గట్టి భద్రత ఉన్నప్పటికీ 15 మంది యువతులు పారిపోవడం సిబ్బందిని షాక్‌కి గురిచేస్తోంది.


Also Read: MLA Jaggareddy: కాంగ్రెస్‌కు బిగ్ షాక్... పార్టీని వీడనున్న జగ్గారెడ్డి.. ఇవాళ అధికారిక ప్రకటన?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook