Telangana Rains: గత కొద్దిరోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో మరిన్ని వర్షాలు పడవచ్చని అంచనా. తెలంగాణలో ఇవాళ్టి నుంచి 4 రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ హెచ్చరించింది. ముఖ్యంగా ఏపీలో రానున్న రెండ్రోజులు , తెలంగాణలో వచ్చే 4 రోజులు భారీ వర్షాలు హెచ్చరిక ఇది. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకూ అతి భారీ వర్షాలు పడనున్నాయి. అంటే వచ్చే మూడ్రోజులు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఈ నెల 25, 26 తేదీల్లో అతి భారీ వర్షాలు పడవచ్చు. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.


ఇవాళ తెలంగాణలోని సంగారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, మెదక్, వరంగల్, రాజన్న సిరిసిల్ల జిల్లా, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, జనగాం, సిద్ధిపేట, ములుగు, సూర్యాపేట, వికారాబాద్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలుంటాయి. బంగాళాఖాతంలో చోటుచేసుకుంటున్న పలు మార్పుల కారణంగా తెలంగాణలోని కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. బంగాళాఖాతంలో ఇప్పటికే ఓ అల్పపీడనం ఉంది. ఇప్పుడు మరో అల్పపీడనం ఏర్పడనుంది. 


Also read: Heavy Rains Alert: రానున్న రెండ్రోజులు ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook