ఆదిలాబాద్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో బీజేపీని టార్గెట్ చేస్తూ తెలంగాణ ఆపధార్మ సీఎం కేసీఆర్ విమర్శలు సంధించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేతల విమర్శలు అర్థరహితమని.. హాస్యాస్పదమన్నారు . రైతులు, మహిళలు, యవకుల సమస్యలపై బీజేపీ  నేతలకు మాట్లాడే అర్హత లేదన్నారు. ..అసలు తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలు చేస్తున్నారా అంటూ ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా కేసీఆర్ బీజేపీ చీఫ్ అమిత్ షాకు షవాల్ విసిరారు.. దేశంలో 19 రాష్ట్రాల్లో బీజేపీ పరిపాలిస్తోంది.. ఎక్కడైనా  రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చారా..రుణమాఫీ ఇక్కడైన చేశారా..వితంతువులకు, వృద్ధలుకు వెయ్యి ఫించన్ ఇచ్చారా ? అంటూ ప్రశ్నలు సంధించారు. వారి రాష్ట్రాల్లో చేయకుండా బీజేపీ అగ్రనేతలు ఇక్కడికి పిచ్చిగా మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి లో లేరన్నారు.  అమిత్ షాకు దమ్ముంటే తాను లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా కేసీఆర్ డిమాండ్ చేశారు.