హైదరాబాద్ : స్వీయ నిర్బంధమే శ్రీరామరక్షా అని శ్రీరామ నవమి సందర్భంగా మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం శ్రీరామనవమి వేడుకల నేపథ్యంలో మంత్రి హరీష్ రావు నవమి వేడుకల గురించి మాట్లాడుతూ.. శ్రీరాముడు కష్టాల్లో మనో నిబ్బరం కోల్పోకుండా ముందుకు సాగి విజయం సాధించారని.. శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకొని విశ్వాన్ని వినాశనం చేసేలా దాపురించిన మహమ్మారి కరోనాని మనోధైర్యంతో తరిమికొడదామని అన్నారు. కరోనా వైరస్ ఒకరి నుండి మరొకరికి వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో శ్రీరామ నవమి వేడుకలు నిరాడంబరంగా జరుపుకోవాలని సూచించారు. ఎప్పటిలా ఆరుబయట కల్యాణ మండపంలో కాకుండా ఆలయాల్లో కేవలం అర్చకుల సమక్షంలోనే శ్రీ సీతారామ కల్యాణం చేయాలని అర్చకులకు తెలిపారు. ఆలయాల్లో అర్చకులు చేసేది లోక కళ్యాణం కనుక ప్రజలంతా ఎవరి ఇంట్లో వాళ్లుండి లోక రక్షణ కొరకు శ్రీరామున్ని ప్రార్ధిద్దాం అని మంత్రి హరీష్ రావు భక్తులకు విజ్ఞప్తిచేశారు. శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొనేందుకని భక్తులు ఎవ్వరూ ఆలయాలకు వెళ్లకూడదని కోరారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : వైష్ణోదేవి ఆలయంలో 400 మంది భక్తులు.. అదెలా సాధ్యం?


శ్రీరాముని అనుగ్రహము ప్రజలందరిపై ఉండాలని... అంతా శుభం కలగాలని మంత్రి హరీష్ రావు ఆ భగవంతుడిని కోరుకున్నారు. ప్రభుత్వం చెప్పే సూచనలు పాటిస్తూ కరోనా మహమ్మారిని పారదోలుదామని మంత్రి హరీష్ రావు స్పష్టంచేశారు. తండ్రి ఆదేశంతో ఆ శ్రీ రాముడు 14 ఏళ్ల పాటు వనవాసం చేసి అద్భుతమైన రామరాజ్యాన్ని స్థాపించారని గుర్తుచేసిన మంత్రి హరీష్ రావు.. ఆయన స్పూర్తితోనే ఈ 14 రోజులపాటు ఇళ్లలోనే ఉంటూ ఆరోగ్యకరమైన దేశంగా మార్చుకుందామని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..