పరువు హత్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి . ప్రేమికులపై దాడులు సర్వసాధారణంగా మారిపోయాయి...పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటున్న జంటలపై కొందరు కుటుంబ పెద్దలు ఏ మాత్రం కనికరం చూపడం లేదు. మిర్యాలగూడ, ఎర్రగడ్డ ఘటనల తర్వాత తాజాగా కరీంనగర్ జిల్లాలో  మరో ఘటన చోటు చేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరీనంగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ లో కుమార్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ప్రియుడి మృతదేహం వద్ద కూర్చోని ప్రియురాలు కన్నీరుమున్నీరు అవుతోంది.  కుమార్ మరణాన్ని జీర్ణించుకోలేక తెగ రోధిస్తోంది. అటు ఘటనా స్థలానికి చేరుకున్న కుమార్ కుటుంబ సభ్యులు గుండెలు పగిలేనా రోధిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థాలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు


స్థానికుల కథకం ప్రకారం కుమార్ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు.. దీంతో వారి ప్రేమను అంగీరించని అమ్మాయి తరఫున బంధులే ఈ హత్య చేసి ఉంటారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా కుమార్ హత్యతో తాడికల్ లో గ్రామస్తుల ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఓ పోలీసులు వాహనాన్ని ధ్వంసం చేసినట్లు సమాచారం. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితలు నెలకొన్నాయి.