Sangareddy Road Accident : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో గ్రామ సర్పంచి భర్త దుర్మరణం చెందాడు. ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. జిల్లాలోని నారాయణఖేడ్ మండలం నుంచి వెంకటాపూర్ గ్రామానికి కిష్టయ్య(60) టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనంపై బయలుదేరారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


మార్గం మధ్యలో వెంకటాపూర్ శివారుకు చేరుకోగానే టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనాన్ని గుర్తుతెలియని లారీ అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కిష్టయ్య శరీరం రెండు ముక్కలైపోయింది. రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగిన కొన్ని నిమిషాల్లోనే ఆయన ఘటనా స్థలంలోనే మరణించాడు. మృతదేహాన్ని సైతం గుర్తుపట్టరాకుండా శరీరం ముక్కలైంది.


Also Read: BSNL Cheapest Plan: తక్కువ ధరకు రీఛార్జ్ ప్లాన్.. Airtel, Jio మరియు VIలకు షాక్!



కాగా, తమ ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదలు జరుగుతున్నాయని చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. సర్పంచి భర్త కిష్టయ్య మరణవార్త సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.


Also Read: EPFO: పీఎఫ్ ఖాతాలో వడ్డీ ఎప్పుడు జమకానుందో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook