Bandi Sanjay on Agnipath: దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేంద్రప్రభుత్వం వెంటనే ఈ పథకాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. దీనిపై అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రభుత్వ తీరును ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. ఇదంతా విపక్షాల కుట్ర అని అధికార పార్టీ కౌంటర్ ఇస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈక్రమంలోనే సికింద్రాబాద్‌ అల్లర్లపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. విధ్వంసమంతా సీఎంవో కుట్రతోనే జరిగిందన్నారు. దాడులకు స్ట్రాటజిస్టు పథక రచన ప్రకారమే జరిగిందని విమర్శించారు. అంతిమ యాత్ర పేరుతో కేంద్ర సంస్థలపై టీఆర్ఎస్‌ దాడులు చేస్తోందని మండిపడ్డారు. కేంద్రాన్ని బదనాం చేయడం కోసమే ఇదంతా జరుగుతోందన్నారు.


ఆందోళనకారులపై కాల్పులు జరిపింది రాష్ట్ర పోలీసులేనని స్పష్టం చేశారు. ఐనా కేంద్రంపై అసత్య ప్రచారం చేయడం సిగ్గు చేటు అని విమర్శించారు. ఆర్మీ అభ్యర్థులు ..తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దన్నారు బండి సంజయ్. యువకులందరికీ న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. రాజకీయ శక్తుల కుట్రల్లో పడవద్దన్నారు. అగ్నిపథ్‌ అద్భుత పథకమని..ప్రజలంతా వాస్తవాలు తెలుసుకోవాలని పిలుపునిచ్చారు.


టీఆర్ఎస్‌లో చీలిక మొదలయ్యిందన్నారు బండి సంజయ్. త్వరలోనే ఆ పార్టీ ముక్కలవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. భవిష్యత్‌లో అనుసరించాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈసందర్భంగా అగ్నిపథ్‌,టీఆర్ఎస్‌పై హాట్ కామెంట్స్ చేశారు.


Also read: Sunil Gavaskar on DK: అలా జరగకపోతే అంతా ఆశ్చర్యమే..దినేష్ కార్తీక్‌పై గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!


Also read:Agnipath Protests Live Updates: రాకేశ్‌ మృతి కుట్ర వెనుక టీఆర్ఎస్, బీజేపి: రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook