Coronavirus Updates in Telangana: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో ( డిసెంబరు 24న ) గురువారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 518 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ముగ్గురు (3) ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,84,074 కి చేరగా.. మరణాల సంఖ్య 1,527 కి పెరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలాఉంటే.. రాష్ట్రంలో కేసులతోపాటు (Covid-19) కరోనా కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో కరోనా నుంచి 491 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఈ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,75,708 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 6,839 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 97.05 శాతం ఉండగా.. మరణాల రేటు 0.53 శాతం ఉంది. Also Read: Vaikuntha Ekadashi: వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు


తెలంగాణ (Telangana) వ్యాప్తంగా నిన్న 44,869 కరోనా టెస్టులు చేశారు. వీటితో కలిపి డిసెంబరు 24వ తేదీ వరకు మొత్తం 66,55,987 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా.. హైదరాబాద్ (GHMC) పరిధిలో 91 కేసులు నమోదయ్యాయి. 


Also Read: New CoronaVirus In Telangana: బ్రిటన్ నుంచి తెలంగాణకు కరోనా వైరస్.. క్లారిటీ ఇచ్చిన మంత్రి ఈటల రాజేందర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook