Mulugu EX-Sarpanch Kidnapped: తెలంగాణ సరిహద్దు జిల్లాల ప్రాంతాల్లో మావోయిస్టులు తమ ప్రాబల్యాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ములుగు జిల్లాకు సంబంధించిన ఓ మాజీ సర్పంచ్ ను కిడ్నాప్ చేసిన ఘటన ఇప్పుడు ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వెంకటాపురం మండలం సూరవీడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కురుసం రమేష్ కిడ్నాప్ న‌కు గుర‌య్యారు. నిన్న సాయంత్రం చర్లకు వెళ్తుండగా మావోయిస్టులు కిడ్నాప్ చేసిన‌ట్టు తెలుస్తోంది.


ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారంతో కుటుంబ సభ్యులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. కన్నీరు మున్నీరుగా విల‌పిస్తున్నారు. రమేష్ కు ఎలాంటి హాని తలపెట్టకుండా విడిచి పెట్టాల‌ని ఆయ‌న భార్య మావోయిస్టుల‌కు విజ్ఞప్తి చేస్తోంది. రమేష్ కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  


Also Read: Winter Effect: రానున్న 3 రోజులు ఏపీ, తెలంగాణల్లో పెరగనున్న చలి తీవ్రత


Also Read:  Video: నడిరోడ్డుపై ఆగిపోయిన కారు-ఎవరూ సాయం చేయని వేళ-ఆ పోలీసులకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి