Telangana COVID-19 Positive Cases : గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లోనూ కోవిడ్-19 మహమ్మారి ప్రభావం పెరుగుతోంది. తెలంగాణలో తాజాగా 337 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,455కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో ఆదివారం రాత్రి 8 గంటల వరకు మొత్తం 37,079 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. అందులో 337 శాంపిల్స్ కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు. వీటితో కలిపి తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,03,455కి చేరింది. అదే సమయంలో కరోనాతో పోరాడుతూ ఇద్దరు చనిపోయారు. దీంతో తెలంగాణ(Telangana)లో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,671కి చేరింది.


Also Read: 7th Pay Commission: హోలీకి ముందే స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ


నిన్న ఒక్కరోజు కోలుకున్న వారి సంఖ్య కన్నా పాజిటివ్ కేసులే అధికంగా నమోదు కావడం గమనార్హం. ఆదివారం నాడు 181 మంది చికిత్స అనంతరం కోవిడ్-19(COVID-19) బారి నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. తెలంగాణలో ఇప్పటివరకూ మొత్తం 2,98,826 మంది కరోనాను జయించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇటీవల ఎన్నికల ప్రచారం, కౌంటింగ్ ప్రక్రియల నేపథ్యంలో పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా నమోదైన కేసులలో 91 జీహెచ్ఎంసీలోనే నమోదు కావడం గమనార్హం.


Also Read: Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో పెరిగిన బంగారం ధర, Silver Price 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook