7th Pay Commission: హోలీకి ముందే స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్, వారి ఖాతాల్లోకి రూ.10 వేలు జమ

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం హోలీకి ముందు స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ పథకాన్ని అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి వడ్డీ లేకుండా 10,000 రూపాయల వరకు ముందుగానే తీసుకోవచ్చు. స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ కింద మార్చి 31, 2021లోగా నగదును తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

1 /5

వాస్తవానికి 7వ వేతన సంఘం(7th Pay Commission) అమలు చేయాల్సిన దాంట్లో ఈ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్‌ను పేర్కొనలేదు. దాంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఇది చాలా ప్రత్యేకమైనది. గతంలో 6వ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముందస్తు పథకం కింద రూ.4500 కేటాయించారు. ఈ ఏడాది దానిని రెట్టింపు కన్నా అధికం చేశారు.  Also Read: Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో పెరిగిన బంగారం ధర, Silver Price

2 /5

పండుగలకు ఇస్తున్న ముందస్తు నగదును ప్రీలోడ్ చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో చెప్పారు. ఈ డబ్బు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చేరనుంది. వారు ఈ నగదును తీసుకుని ఖర్చులకు వినియోగించుకోవడమే మిగిలి ఉందని సమాచారం. అయితే ఎలాంటి వడ్డీ లేకుండా అందించే ఈ నగదు మొత్తాన్ని 10 సులభమైన వాయిదాల ద్వారా తిరిగి చెల్లించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రీపెయిడ్ రుపే కార్డు రూపంలో ఈ రుణం ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం అందించే పండుగకు ముందస్తు అందించే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. Also Read: EPFO: తెరపైకి కొత్త వేతన కోడ్, EPFతో పాటు జీతాల్లో ఏప్రిల్ 1 నుంచి మార్పులు

3 /5

ఆరవ వేతన సంఘం(6th Pay Commission) ప్రకారం, గెజిటెడ్ కాని అధికారులు మరియు ఉద్యోగులకు 4,500 రూపాయలను ఫెస్టివల్ అడ్వాన్స్ చెల్లించారు. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం హోలీ ఫెస్టివల్ అడ్వాన్స్ కింద రూ .10,000 వరకు అడ్వాన్స్ ఇస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి అందుకున్న ముందస్తు నగదును మార్చి 31, 2021 లోపు విత్‌డ్రా చేసుకోవాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. Also Read: Income Tax Rules: ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఇన్‌కమ్ ట్యాక్స్ కొత్త రూల్స్ ఇవే

4 /5

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెద్ద ఉపశమనం కల్పిస్తూ, పెండింగ్‌లో ఉన్న వారి మూడు విడతలు డియర్‌నెస్ అలవెన్స్ (Dearness Allowance) మరియు డియర్‌నెస్ రిలీఫ్ (Dearness Relief )ను జూలై నుండి చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పెండింగ్‌లో ఉన్న మూడు డియర్‌నెస్ అలవెన్సులు మరియు పింఛనుదారులకు డియర్‌నెస్ రిలీఫ్ పెండింగ్‌లో ఉంది. సవరించిన రేట్లలో డీఏను సైతం అందించనున్నామని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

5 /5

కోవిడ్-19 మహమ్మారి ప్రభావం కారణంగా జనవరి 1, 2020, జూలై 1, 2020 మరియు జనవరి 1, 2021 న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ మరియు డీఆర్‌ల పెంపు, ఈ 3 దఫాల చెల్లింపులను వాయిదా వేస్తూ అప్పట్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.  Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook