హైదరాబాద్: పదవ తరగతి చదువుతున్న విద్యార్థిపై కొందరు గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో విద్యార్థికి రక్తస్రావమైంది. మేడ్చల్ జిల్లా అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. స్థానిక శివనగర్‌కు చెందిన వంశీ 10వ తరగతి చదువుతున్నాడు. ట్యూషన్‌కు వెళ్లివస్తుండగా అతడిని అడ్డగించి కొందరు వ్యక్తులు దాడి చేశారు. దాదాపు ఎనిమిది మంది వంశీపై దాడికి పాల్పడ్డారు. కొందరు బ్లేడుతో దాడిచేసి వంశీని గాయపరిచారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విధి ఆడిన వింత నాటకం.. వాళ్లకు ఎంత నరకం!


దుండగుల దాడిలో తీవ్రంగా రక్తస్రావమైన వంశీని లోతుకుంటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శరీరంలో మూడు చోట్ల బ్లేడుతో కోసిన గాయాలున్నట్లు వైద్యులు గుర్తించారు. విద్యార్థి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పిన వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఈ దాడి ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.


Avengers బ్యూటీ స్కార్లెట్ జాన్సన్ అందాలివిగో!


మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..