నేటితో ప్రచార గడువు ముగుస్తున్న నేపథ్యంలో వీడియో రూపంలో సోనియా గాంధీ తన సందేశాన్ని తెలంగాణ ప్రజలకు వినిపించారు. ప్రియమైన తెలంగాణ ప్రజలారా.. మీకు నా నమస్కారం..డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో మీరు మీ శాసన సభ్యులను ఎన్నుకోబోతున్నారు..ఈ ఎన్నికలు కేవలం రాష్ట్ర భవిష్యత్తు గురించే కాదు.. మీ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తాయనే విషయం మరిచిపోకండి.ఒకవైపు మీ ఆలోచనలకు విరుద్ధంగా నడిచే టీఆర్ఎస్ పార్టీ..మరోవైపు మీ ఆకాంక్షలను నెరవేర్చే మహాకూటమి. ప్రజా కూటమి పేరుతో ఏర్పాడిన కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీఆర్ఎష్ పార్టీలు మీ వాయిస్ ను వినిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఆకాంక్షలను ప్రజాకూటమి తప్పకుండా నెరవేరుస్తుంది. నాలుగున్నర ఏళ్ల ముందు మీకు తెలంగాణ వచ్చింది. ఈ విషయంలో నేను ఎంత కీలక పాత్ర పోషించానో మీరు తెలిసిందే. కానీ ఇక్కడ వచ్చిన ప్రభుత్వం మీ ఆశలను వమ్ము చేసింది. ఎన్నికల రూపంలో మీకు మోసం చేసిన ప్రభుత్వానికి ఇంటికి పంపే అవకాశం వచ్చింది. టీఆర్ఎస్ పార్టీని ఓడించి ..మీ ఆకాంక్షలకు అనుగుణంగా నడిచే ప్రజాకూటమికి ఓటు వేయాలని మీకు నేను కోరుతున్నా ..జై తెలంగాణ.. జైజై తెలంగాణ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.