నల్గొండ: టిఎస్ఆర్టీసీకి చెందిన నార్కెట్‌పల్లి డిపో బస్సుకు పెను ప్రమాదం తప్పింది. నార్కెట్‌పల్లి నుంచి నల్గొండ వెళ్తున్న ఏపీ 28జెడ్ 3744 నెంబర్ కలిగిన పల్లెవెలుగు బస్సు ఎల్లారెడ్డిగూడెం శివారులోకి చేరుకోగానే వెనుక వైపున్న టైరు రన్నింగ్‌లో ఉండగానే ఊడిపోయింది. ఊహించని ఘటనతో ఉలిక్కిపడిన ప్రయాణికులు బస్సుకు బ్రేకులు వేసి నిలిపేసేవరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికుల వరకు ఉన్నారు. 


అదృష్టవశాత్తుగా ఆ సమయంలో బస్సు వేగం తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని.. లేదంటే ఊహించని దారుణం జరిగిపోయి ఉండేదని ప్రయాణికులు వాపోయారు.